వాళ్ల జేజమ్మ దిగిరావాలి: సుబ్బారెడ్డి
ఒంగోలు: టీడీపీ ప్రభుత్వం నైతికంగా ఎప్పుడో పతనమైందని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 100 రోజుల పండగ చేసుకోవడానికి టీడీపీ నాయకులకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లోజ్ అవుతుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి మండిపడ్డారు. తమ పార్టీ క్లోజ్ కావాలంటే టీడీపీ నాయకుల జేజమ్మ దిగిరావాలని అన్నారు.