బెజవాడలో వైఎస్ఆర్ సీపీ సమీక్షా సమావేశం


విజయవాడ :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించింది. హోటల్ ఐలాపురంలో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరావు హాజరయ్యారు.  జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయటానికి చేపట్టాల్సిన నిర్మాణాత్మక కార్యక్రమాలు, పార్టీపరమైన ఇతర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు.  జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, 16 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలు   సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top