'ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొంగే'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముమ్మాటికీ దొంగేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజుతో కలిసి మీడియాతో మాట్లాడిన ప్రభాకర్.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు దొంగేనన్నారు. దొంగతనం చేస్తూ పట్టుకుంటూ తప్పు అంటున్నారని కర్నె ప్రభాకర్, బాలరాజులు మండిపడ్డారు.
ఏపీ ప్రయోజనాలను పక్కకు పెట్టి రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. శాసనసభలో తమ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ ను ఎందుకు స్వీకరించలేదని వారు ప్రశ్నించారు.