వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆదిశేషగిరిరావు, ఉమ్మారెడ్డి
హైదరాబాద్:స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి జరగబోయే ఎన్నికల అభ్యర్థులను వైఎస్సార్ సీపీ ఎంపిక చేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులను వైఎస్సార్ సీపీ ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.
కృష్ణా జిల్లా నుంచి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను ఎంపిక చేస్తూ వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకుంది.