టీడీపీవి శవరాజకీయాలు: రాజన్నదొర
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం శవ రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైఎస్ఆర్సీపీలో ఎస్సీ మహిళలకు సముచిత స్థానం లేదన్న గీత వ్యాఖ్యలు బాధాకరమని పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి చెప్పారు. తన వెనుక ఎటువంటి షాడో శక్తులు లేవని, గిరిజన ఎమ్మెల్యేగా చట్టసభకు వెళ్లడంపై గర్విస్తున్నానని ఆమె అన్నారు.