నెల్లూరులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఏపీ బంద్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం సర్వ విధాలుగా ప్రయత్నిస్తోంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్ట్ చేస్తూ బంద్ ను అడ్డుకునే యత్నాలకు పాల్పడుతోంది.
నెల్లూరు జిల్లాలోని కావలిలో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయగా, గూడురులో మానవహారంతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న సునీల్ కుమార్ ను ఎంపీ వరప్రసాద్ పరామర్శించారు.