'ఇళ్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను తొలగించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఇళ్ల తొలగింపుపై స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తానని ఆర్కే వారికి హామీ ఇచ్చారు.