కాంట్రాక్టు కార్మికుల పట్ల సర్కార్ తీరు దారుణం
హైదరాబాద్ : కాంట్రాక్టు కార్మికుల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా సేవలందిస్తున్నా.... వారిని కాంట్రాక్ట్ సేవలకే పరిమితం చేయడం దారుణమన్నారు. న్యాయబద్ధమైన వేతనాల కోసం ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. అసెంబ్లీ విరామ సమయంలో మీడియాతో మాట్లాడిన విశ్వేశ్వరరెడ్డి....కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై చంద్రబాబును నిలదీశారు.