యాదాద్రిలో ఎమ్మెల్యే రోజా
హైదరాబాద్: తెలంగాణలో మరో తిరుపతిగా భావించే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆదివారం సందర్శించారు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఆదివారం యాదగిరి గుట్ట భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. స్వామి వారి దర్శానానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది.
సంబంధిత వార్తలు