'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు'

'రెండోపంట వేయొద్దనడానికి మీరెవరు' - Sakshi


గుంటూరు: ఏపీ రాజధాని పరిధిలో రెండో పంట అవకాశం లేదంటూ సీఆర్డీఏ కమీషనర్ చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుంటూరులో ఆయన బుధవారం మాట్లాడుతూ... సీఆర్డీఏ పరిధిలో ఎమర్జెన్సీ అమలు చేయాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక చట్టం, రాజధాని పరిధిలో మరో చట్టాన్ని అమలు చేయాలని చూస్తే సహించమని ఆయన హెచ్చరించారు.


భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన చోట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాతమకు అభ్యంతరం లేదన్నారు.  రెండోపంట వేయొద్దని చెప్పే హక్కు కమీషనర్ కు లేదన్నారు.  ఈ విషయమై రైతులకు కోర్టుకు వెళ్లే హక్కు ఉందని ఆర్కే తెలిపారు.

 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top