'మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదు'


హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్న దొర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ సహా చాలాచోట్ల మహిళలు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప సమాధానం ఇస్తూ మహిళలపై  దాడులు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top