‘విచ్చలవిడిగా డబ్బు వెదజల్లారు’

‘విచ్చలవిడిగా డబ్బు వెదజల్లారు’ - Sakshi


విజయవాడ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. వందలకోట్లు వెచ్చించి చార్టర్‌ ఫ్లైట్లతో క్యాంపులు నిర్వహించారని ఆయన విమర్శించారు. మంత్రులే స్వయంగా జిల్లాల్లో మకాం వేసి విచ్చలవిడిగా డబ్బు వెలజల్లారని ఎమ్మెల్యే సురేష్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీలో మీడియాకు పారదర్శకత లోపించిందని ఎమ్మెల్యే అన్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top