వైఎస్సార్‌సీపీ నేతల వంటా-వార్పు


రేగిడి (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు శనివారం మధ్యాహ్నం వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నేతలు శనివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జగన్మోహనరావు, ఎమ్మెల్యే జోగులు, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top