చంద్రబాబు ఆగడాలు అరికట్టండి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్సీపీ వినతి
నంద్యాల విద్య: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటర్లను ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్కు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొత్తగా ఓటు హక్కు కోసం నంద్యాల నుంచి వచ్చిన పది వేల దరఖాస్తులపై అభ్యంతరాలను పరిశీలించడానికి భన్వర్లాల్ సోమవారం కర్నూలు జిల్లా నంద్యాల వచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన్ను పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్యేలు ఐజయ్య, సునీల్కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నాయకులు రవిచంద్ర కిశోర్రెడ్డి, న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి కలిశారు. నంద్యాల ఉప ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలంటూ భన్వర్లాల్కు వినతిపత్రం సమర్పించారు.