‘పచ్చ నాటకాలు ఆపండి’
కడప: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ నాయకులు పచ్చ నాటకాలు ఆపాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మలకుంట శివశంకర్ సూచించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నంద్యాలలో లక్ష మందితో వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన సభతో టీడీపీ నేతల్లో గుబులు పుట్టిందన్నారు. ఏం చేయాలో దిక్కుతోచక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, అరాచకాలు, అక్రమాలు, అకృత్యాలను, అబద్ధాలను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్ జగన్ కోరారన్నారు.
దానికి టీడీపీ నాయకులు పెడార్థాలు తీయడం తగదన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ముఖ్యమంత్రి నానా గడ్డి కరుస్తున్నారని, ఇందుకోసం పదవులు, డబ్బు ఎర వేస్తున్నారన్నారని చెప్పారు. ఈ సమావేశంలో మహిళా విభాగం సభ్యురాలు నారాయణమ్మ పాల్గొన్నారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కరిముల్లా, నగర అధ్యక్షుడు షఫీ, నగర మహిళా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మలు పాల్గొన్నారు.