వైఎస్సార్సీపీ నేత దారుణహత్య
పెద్దవడుగూరు: వైఎస్సార్సీపీ నాయకుడు, క్రిష్టిపాడు సింగిల్విండో అధ్యక్షుడు చిట్టెంరెడ్డి విజయభాస్కర్రెడ్డి(45)ని టీడీపీ నేతలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం అప్పేచర్ల గ్రామంలో మంగళవారం జరిగింది. 2013లో జరిగిన క్రిష్టిపాడు సహకార పరపతి సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హతుడు ఈ పదవిలో కొనసాగుతున్న సమయంలో ఇద్దరు డెరైక్టర్లతోసహా భాస్కర్రెడ్డి వైఎస్సార్సీపీలో చేరాడు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇటీవల ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీనిపై మార్చి 10న ప్రభుత్వం స్టే విధించింది. ఎలాగైనా సహకార సంఘం అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే నిందితులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత కుటుంబీకులు చెప్పారు. మంగళవారం టీడీపీ నేతలు వెంకటేశ్నాయుడు, శ్రీనివాసులు నాయుడు వర్గానికి చెందిన 17 మంది సొసైటీ వద్దకు చేరుకుని అవిశ్వాస తీర్మానం పెట్టామని, అధ్యక్షుడిగా దిగిపోవాలంటూ భాస్కరరెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఇందుకు ససేమిరా అనడంతో కట్టెలు, కొడవళ్లతో మూకుమ్మడిగా దాడి చేశారని ఇదే ఘటనలో గాయాలపాలైన దత్తాత్రేయరెడ్డి చెప్పాడు.