జగన్ అంటే బాబుకు ఎందుకంత భయం ?
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సీఎం చంద్రబాబుకు ఎందుకంత భయమని ఆ పార్టీ నేత జోగి రమేష్ ప్రశ్నించారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని చంద్రబాబు అడ్డానా ? అని మండిపడ్డారు.
రాష్ట్రంలో పర్యటించాలంటే చంద్రబాబు అనుమతి తీసుకోవాలా ? అని జోగి రమేష్ నిలదీశారు. విపక్షనేతగా చంద్రబాబు రాష్ట్రంలో పర్యటనలు చేసినప్పుడు అనుమతులు తీసుకున్నారా? అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా నేతలు పాల్గొన్నారు.