కేంద్ర మంత్రులు రాజీనామా చేయూలి
పూలపల్లి (పాలకొల్లు అర్బన్) : బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచెయి చూపించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయూలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నేత మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. పూలపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ విషయంలో ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వెంటనే ఎంపీలు, అన్ని రాజకీయపార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపి రాష్ట్ర అవసరాలకు నిధులు రాబట్టాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.
ప్రతిపక్షంలో ఉండగా బీజేపీ నేత వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని కోరారని, అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తకపోవడం దురదృష్టకర మన్నారు. పోలవ రం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని, తాగు,సాగునీటి కష్టాలు తీరతాయని అయితే బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉభయ గోదావరి జిల్లా రైతాంగం సాగునీటి కష్టాలను ఎదుర్కోబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కోటరీ కమిషన్లు దండుకోవడానికే ఎత్తిపోతల పథకం జపం చేస్తున్నారని శేషుబాబు ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మైలాబత్తుల మైఖేల్రాజు, ఎంపీటీసీ కర్ణి జోగ య్య, కౌన్సిలర్ దొమ్మేటి వెంకట్రావు, పార్టీ నాయకులు అనిశెట్టి గోపి, రావి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.