చంద్రబాబుపై ఫిర్యాదు
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది. నంద్యాల ఉప ఎన్నికలను వాయిదా వేయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపైన కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన నంద్యాల కమ్యూనిటీ హాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు.
కాగా, మంత్రులతో సహా నంద్యాలలో తిష్టవేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటర్లను డబ్బులిస్తూ కెమెరాలకు దొరికిపోయారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.