బంద్‌లో పాల్గొన్న కార్మిక సంఘాలు


నాయుడుపేట: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట నేలకూరు పారిశ్రామిక వాడలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, పారిశ్రామికవాడకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాల్సిందేనని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top