రైతు సమస్యలపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, కరువు, అన్నదాతల ఆత్మహత్యలపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు డిసెంబర్ 23వ తేదీ వరకు జరుగుతాయి.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజైన గురువారం తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతిపై సీఎం చంద్రబాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం వెంకటరమణ మృతిపై వివిధ పార్టీల నాయకులు సభలో సంతాప ప్రకటన చేసిన తర్వాత అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేసిన విషయం విదితమే.