వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి


ఆత్మకూరు: పట్టణంలోని 7వ వార్డులో శుక్రవారం టీడీపీ కార్యకర్తలు ైవె ఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తల ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు కార్పెంటర్ షరీఫ్, అన్వర్, పెయింటర్ మాబాషా, కూల్ డ్రింక్‌మాబాషా వచ్చారు.

 

 వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్త జరీన ఇంటి వద్దకు వెళ్లి మంచి నీటి పైపులైన్ విషయంలో ఘర్షణకు దిగారు. పైపులైన్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికి టీడీపీ కార్యకర్తలు అన్వర్, కార్పెంటర్ షరీఫ్ అధికారంలో మా ప్రభుత్వం ఉంది ఏంచేస్తారంటూ దౌర్జన్యంగా మహిళలపై చేయి చేసుకున్నారు. దీంతో వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డగించారు. మమ్మల్ని అడ్డగిస్తారా అంటూ వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు.

 

 

 ఈ దాడిలో వైఎస్‌ఆర్ సీపీకి చెందిన షేక్‌నూర్‌అహ్మద్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. షేక్‌షంషాద్ భుజం, తలకు, ఉమర్‌ఫరూక్, జరీన, షాలు ఫైల్మాన్‌లకు పలు చోట్ల గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డ కార్యకర్తలు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ మురళీమోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. గాయాలైన వారిని స్థానిక ప్రభుత్వ  వైద్యశాలలో పరీక్షలు నిర్వహించారు.

 

 ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నాయకులు షాలుపైల్మాన్ మాట్లాడుతూ తాము మంచి నీటి కనెక్షన్‌కు వ్యతిరేకం కాదని, తాము రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఈ సంఘటనపై  ఎస్‌ఐ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఘర్షణకు పాల్పడిన రెండు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top