నంద్యాలలో వైఎస్ఆర్-వంగవీటి ఫ్లెక్సీ తొలగింపు!
నంద్యాల: నంద్యాలలో ఏర్పాటుచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, దివంగత కాపునేత వంగవీటి రంగాల భారీ ఫ్లెక్సీని తొలగించడం వివాదం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నంద్యాల పర్యటన నేపథ్యంలోనే ఈ ఫ్లెక్సీని తీయించినట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం అధ్యక్షుడు రత్నాకర్ శుక్రవారం కడపలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు. వైఎస్ఆర్-వంగవీటి ఫొటో అంటే చాలు సీఎం చంద్రబాబుకు నిద్రపట్టదని, అందుకే ఈ ఫ్లెక్సీని తీయించారని వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం ఫ్లెక్సీ పెట్టుకున్నా ప్రభుత్వం భరించలేకపోతోందని విమర్శిస్తున్నారు.