'గాజులదిన్నె'కు వైఎస్ఆర్ రూ. 52 కోట్లు కేటాయించారు


కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ ప్రజల తాగునీటి సమస్యలు తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాజుల దిన్నె ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ... 2008లో గాజులదిన్నె ప్రాజెక్ట్కు వైఎస్ఆర్ రూ. 52 కోట్ల నిధులు కేటాయించిన సంగతి గుర్తు చేశారు.



గతంలో ఎన్నడూ ఈ ప్రాజెక్ట్ను చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పడు ఆయన వచ్చి తానే 10 రోజుల్లో చేశానని గొప్పలు చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. హంద్రీ - నీవా నుంచి కొత్త చెరువుకు నీరు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని ఆయన డోన్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఓ వేళ ఇప్పుడు సాధ్యం కాకుంటే వచ్చే మన ప్రభుత్వంలో నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ జగన్ ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top