వైఎస్సార్ వల్లే పేదలకు కార్పొరేట్ వైద్యం

వైఎస్సార్ వల్లే పేదలకు కార్పొరేట్ వైద్యం


తొండూరు :

 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ 7,500మందికి సర్జరీలు జరిగినట్లు ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటరు వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన తొండూరు పీహెచ్‌సీలో ఆరోగ్య శ్రీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొండూరు మండలంలో ఆరోగ్యశ్రీ కింద దాదాపు 660మందికి పలు రకాల వ్యాధులకు సంబంధించి ఆపరేషన్‌లు జరిగినట్లు తెలిపారు. అందుకు సంబంధించి రూ.1.85కోట్లు మండలానికి.. 7,500మందికి గానూ జిల్లాకు రూ.223కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.  అనంతరం ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు చేయించుకున్న నలుగురు లబ్ధిదారులతో మాట్లాడారు. వారి ఆరోగ్య స్థితిగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ గిరిధర్, డీటీఎల్ రామరావు, ఆరోగ్య మిత్రలు సురేష్‌రెడ్డి, కిరణ్  పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top