అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సిపి వాకౌట్

అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్ సిపి వాకౌట్ - Sakshi


హైదరాబాద్: బడ్జెట్పై చర్చించడానికి శాసనసభలో తగిన సమయం ఇవ్వనందుకు నిరసన తెలుపుతూ వైఎస్ఆర్ సిపి వాకౌట్ చేసింది. బడ్జెట్పై చర్చ సందర్భంగా మళ్లీ సభలో గొడవ జరిగింది. ప్రతిపక్షానికి గంటన్నర సమయం మాత్రమే ఇచ్చారు. ఈ విషయమై  వైఎస్ఆర్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి మాట్లాడుతూ గత శాసనసభ సమావేశాలలో ప్రతిపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారో చూసి, ఆ మేరకు తమకు కూడా సమయం ఇవ్వమని కోరారు.



సభలో ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షమని ఆయన గుర్తు చేశారు. తమకు సమయం ఇవ్వకపోతే నిరసనగా వాకౌట్ చేయడం తప్ప తమకు మరో మార్గంలేదని చెప్పారు. అయినా సమయం ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్ సిపి సభ్యులు వాకౌట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top