నేడు వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ


భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరవుతున్నట్టు పార్టీ నాయకులు వెల్లడించారు.  

 

పట్నంబజారు(గుంటూరు) భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించనున్న భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ నగరాధ్యక్షడు లేళ్ల అప్పిరెడ్డి  పిలుపునిచ్చారు. జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఆయా మండలాల అధ్యక్షులు, విభాగాల అధ్యక్ష, కార్యదర్శలు తప్పని సరిగా హాజరుకావాలని కోరారు. ఉదయం 10 గంటలకు లాడ్జి సెంటర్ సెంటర్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని సూచించారు. నగరంలో అన్ని విభాగాల నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టన ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఏ నాయకుడు చేయని విధంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పండుగలా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు.



13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఘన స్వాగతం పలకాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ప్రదర్శన రాష్ట్రంలో ఒక కలికితురాయిలా నిలిచిపోతుందని చెప్పారు. లాడ్జి సెంటర్‌లో ప్రారంభమైన ప్రదర్శన శంకర్‌విలాస్, ఓవర్‌బ్రిడ్జీ, హిందూ కళాశాల కూడలి మీదుగా వెంకటేశ్వరవిజ్ఞాన మందిరానికి చేరుకుంటుందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేలా ప్రతి కార్యకర్త తరలిరావాలన్నారు.



న్యాయవాదులు తరలిరండి

పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే ‘రాజ్యాంగ ఆమోద దినోత్సవ’ భారీ ప్రదర్శనను జయప్రదం చేయాలని పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ లీగల్ విభాగంకు చెందిన న్యాయవాదులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.  

 

కాంగ్రెస్ ఆధ్వర్యంలో...


 ఆనందపేట :భారత రాజ్యాంగ అమోద దినోత్సవాన్ని గురువారం పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరి రాజశేఖర్ తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల అధ్వర్యంలో పార్టీ జిల్లా  కార్యాలయంలో రాజ్యాంగ అమోద దినోత్సవం చేస్తున్నామని చెప్పారు.   సమావేశంలో పార్టీ వివిధ విభాగాల నాయకులు మొగిలి శివకుమార్, దోంతా సురేష్, సవరం రోహిత్, షేక్ మౌలాలి తదితరులున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top