నేడు వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం శనివారం నగరంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. హోటల్ ఐలాపురంలో జరిగే ఈ సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు హాజరవుతారని వివరించారు. జిల్లాలోని తమ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, 16 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన నిర్మాణాత్మక కార్యక్రమాలు, పార్టీపరమైన ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు.