రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు - Sakshi


మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతివేడుకలు బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు.


 


హైదరాబాద్: పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు నివాళులర్పించారు.

 


అనంతపురం:  వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.



కృష్ణా: నందిగామలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం. అరుణ్ కుమార్ రక్తదాన శిబిరం ఏర్పాటుచేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.



వరంగల్: నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతివేడుకులు, పేద విద్యార్థులకు నియోజక వర్గ కో ఆర్డినేటర్ నాడెం శాంతికుమార్ నోటుబుక్స్ పంపిణీ చేశారు.


తిరుపతి: వైఎస్ఆర్సీపీ నేత కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.



చిత్తూరు: వైఎస్ విగ్రహాలకు నగర కన్వీనర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.


విజయనగరం: గొర్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పార్టీ నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, పెన్మత్స సాంబశివరాజు, బెల్లం చంద్రశేఖర్ నివాళులర్పించారు.



కర్నూలు: షరీమ్ నగర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలువేసి ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి నివాళులర్పించారు.



విశాఖ: పార్క్ హోటల్ వద్ద వైఎస్ విగ్రహానికి వైఎస్ వివేకానందరెడ్డి, విజయసాయిరెడ్డిలు నివాళులర్పించారు.


తూర్పుగోదావరి: వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యేజ్యోతుల నెహ్రు నివాళులర్పించారు.

కృష్ణా: మైలవరంలో వైఎస్ఆర్సీ నేత కాజా రాజకుమార్ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు.



కర్నూలు: వైఎస్ఆర్ సర్కిల్ లో వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీలు పాలాభిషేకం చేశారు.



హైదరాబాద్(పంజాగుట్ట): ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, దానం నగేందర్, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, కేవీపీ, ఇతర కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.



కడప: ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ప్రభుత్వాసుపత్రిలోపండ్లు పంపిణీ చేశారు.


-ఎమ్మెల్యే అంజాద్ బాషా, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబులు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 

-జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి అనాధలకు అన్నదానం చేశారు.

-ఎర్రగుంట్ల మం. తిప్పనూరులో వైఎస్ఆర్ విగ్రహానికి జడ్పీ చైర్మన్ గూడూరు రవి పాలాభిషేకం చేశారు.





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top