శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్‌ పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో నేడు, రేపు జగన్‌ పర్యటన - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19, 20 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం తొలిరోజున పాతపట్నం నియోజకవర్గంలోని హీర మండలంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖీ  కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామం హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను జగన్‌ కలుసుకుని వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటారు.



నేడు వైఎస్సార్‌సీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే వరద రామారావు

ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరదరామారావు శుక్రవారం ఉదయం 11 గంటలకు రణస్థలంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ గురువారం విడుదల చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top