రేపు ప్రకాశం జిల్లా పర్యటనకు వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రెండ్రోజుల పాటు ప్రకాశం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
సోమవారం కందుకూరు, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాల నాయకులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. మంగళవారం ఒంగోలు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, కొండెపి, దర్శి నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.