వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు

వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు - Sakshi


శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు అయినట్లు పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. ఈ నెల 21న వంశధార నిర్వాసిత గ్రామాల్లో జగన్‌ పర్యటించాల్సి ఉంది. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్యటన రద్దు అయినట్లు ఆమె చెప్పారు.      



శ్రీకాకుళంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యే వెంకటరమణపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి ఎమ్మెల్యే కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు అందించే నష్టపరిహారం చెక్కుల్లో ఆయన భారీగా అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు త్వరలో బయటపెడతామని రెడ్డి శాంతి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top