నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష

నేడు విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్ష - Sakshi


హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.


లోటస్పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ జిల్లా నేతలతో ఈ సందర్భంగా చర్చించనున్నారు. కాగా ధర్నా అంశంపై వైఎస్ జగన్ ఇప్పటికే వివిధ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీన విశాఖ కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top