విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - Sakshi


విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన ఈరోజు, రేపు విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. ఈ రాత్రికి ఆయన  విజయనగరం వెళతారు. పట్టణ సమీపంలోని ఆర్కే లేఅవుట్‌లో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు.



రాత్రికి విజయనగరం జెడ్పీ అతిథి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజు మనవడి వివాహ కార్యక్రమంలో భాగంగా జరిగే ఉపనయనానికి హజరవుతారు.  ఆ తరువాత 11 గంటలకు నెల్లిమర్ల నుంచి బయలుదేరి విశాఖ మీదుగా హైదరాబాద్ వెళతారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top