జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. పట్నాయక్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జేబీ పట్నాయక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జేబీ పట్నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు.