రేపట్నుంచి తణుకులో వైఎస్ జగన్ దీక్ష
తణుకు: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నుంచి తణుకులో దీక్ష చేపట్టనున్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జగన్ దీక్ష చేయనున్నారు.
ఈ దీక్షలో ప్రభుత్వ మోసపూరిత విధానాలను జగన్ ప్రశ్నించనున్నారు. నిస్సహాయస్థితిలో ఉన్న మహిళలకు, రైతులకు అండగా ఉండటమే లక్ష్యంగా దీక్షకు దిగుతున్న జగన్ .ప్రభుత్వం మోసపూరిత విధానాలను ఎండగట్టనున్నారు.