రాజమౌళితో మాస్టర్ప్లాన్ వేయిస్తారట
నిడుమర్రు: చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటామని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బలవంతంగా ఎవరి దగ్గర భూములు తీసుకోబోమని ల్యాండ్ పూలింగ్ సమయంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడేమో బలవంతంగా భూములు లాక్కొంటున్నారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో తాను పర్యటించకుండా ఆంక్షలు విధించడం సిగ్గుచేటని అన్నారు. గురువారం గుంటూరు జిల్లా నిడుమర్రులో వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
వైఎస్ జగన్ రైతులతో మాట్లాడుతూ.. ‘ఏ గ్రామాలకు వెళ్లకుండా కట్టడి చేశారో ఆ గ్రామాల వారు కూడా ఇక్కడికి వచ్చారు. మీరు పడుతున్న ఇబ్బందులను మీ నోటి ద్వారానే చెప్పండి. మీ మాటల ద్వారా అయినా చంద్రబాబుకు బుద్ధి, జ్జానం వస్తుందేమో? మీ పోరాటానికి వైఎస్ఆర్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మీరు పడుతున్న బాధలను చెప్పండి. నేను, రాష్ట్ర ప్రజలు, చంద్రబాబు వింటారు’ అని అన్నారు.
- మాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది
- ఇవ్వమన్నా బలవంతంగా తీసుకున్నారు
- ఎవరినీ బలవంతం పెట్టబోమని, బలవంతంగా తీసుకోబోమని చంద్రబాబు తొలుత చెప్పారు
- అభ్యంతరాలు ఉంటే తెలియజేయంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను
- ఇవాళ చంద్రబాబు బలవంతంగా భూములు లాక్కొన్నారు
- ఇక్కడ ఎకరాకు 2 కోట్లా 10 లక్షల రూపాయల వరకు ధర ఉంది
- 18 లక్షల రూపాయలు మాత్రమే చంద్రబాబు ఇస్తామంటున్నారు
- భవిష్యత్లో ఇంకా మంచి ధరలు వస్తాయని, తొందరపడి భూములు అమ్ముకోవద్దని చెప్పిన చంద్రబాబే ఇలా చేశారు
వైఎస్ జగన్ ఏం చెప్పారంటే..
- చంద్రబాబు రైతుల నుంచి తక్కువ ధరకు భూములు లాక్కొంటున్నారు
- రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువ పెంచారు. ఇక్కడ మాత్రం భూముల ధరలు పెంచలేదు
- ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు అన్యాయంగా, దారుణంగా వ్యవహరించాడు
- ముఖ్యమంత్రి ఇంతలా దిగజారడం సిగ్గుచేటు
- చంద్రబాబు సీఎం అయి మూడు సంవత్సరాలయినా రాజధాని ఎక్కడ ఉంది అంటే, రాజధానిలో ఎక్కడయినా అభివృద్ధి జరిగిందా అంటే ఎక్కడా ఒక్క ఇటుక కూడా కనిపించదు
- చంద్రబాబు అన్ని తాత్కాలిక భవనాలు అంటున్నారు
- ఇంతవరకు మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అయ్యిందో లేదో తెలియదు
- చంద్రబాబు ఏ దేశం వెళితే ఆ దేశంతో మాస్టర్ ప్లాన్ తయారు చేయిస్తానని అంటారు
- సింగపూర్కు వెళితే సింగపూర్ మాస్టర్ప్లాన్ అంటారు
- చైనాకు పోతే చైనా మాస్టర్ ప్లాన్ అంటారు
- శ్రీలంకకు పోతే శ్రీలంక మాస్టర్ ప్లాన్ అంటారు
- చివరకు సినిమాలను కూడా వదిలిపెట్టరు
- బాహుబలి సినిమా సెట్టింగ్లు చూసి ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళితో మాస్టర్ ప్లాన్ వేయిస్తామంటారు
- ఎక్కడ కూడా పర్మినెంట్ సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ కనపడలేదు
- అన్ని తాత్కాలిక భవనాలు అంటున్నారు
- మద్యం, ఇసుక, దేవుడి భూములు వేటినీ చంద్రబాబు వదల్లేదు
- రాజధాని భూముల్లోనూ స్కాంలకు పాల్పడ్డారు
- రాజధాని కట్టడానికి చంద్రబాబుకు క్లారిటీ ఉందా అని అడుగుతున్నా
- రాజధాని కోసం చంద్రబాబు 48 వేల ఎకరాలు సేకరించారు
- చివరకు పేదవాళ్లని చూడకుండా, అసైన్డ్ భూములను చూడకుండా తక్కువ ధరకు బలవంతంగా తీసుకున్నారు
- చంద్రబాబు తనకు నచ్చినవాళ్లకు, నచ్చిన ధరకు భూములు ఇస్తూ పోతున్నారు
- స్విస్ ఛాలెంజ్ పేరుతో తనకు నచ్చిన సింగపూర్ ప్రైవేట్ కంపెనీకి 1600 ఎకరాల భూములు ఇచ్చారు
- చంద్రబాబు దగ్గర ఉండి తనకు నచ్చిన సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు తక్కు ధరకు కమీషన్ తీసుకుని ఇస్తున్నారు
- పేదవాళ్లను, ఎస్సీలను, బీసీలను చంద్రబాబు ఎలా మోసం చేస్తున్నారో వాళ్ల నోటి ద్వారానే చెప్పిస్తాం
- ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్న భూములకు 1000 గజాల పట్టాలు ఇచ్చి ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదు
- చంద్రబాబు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రైతులకు తెలియదు
- రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వలేదు
- కేవలం చెత్తకాగితం మీద రాసిచ్చారు
- ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలకే దిక్కులేదు
- ఇప్పడు చెత్తకాగితం మీద రాసినవాటికి ఏం చట్టబద్ధత ఉంటుంది?