విష జ్వరాల బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
కడప: జిల్లాలోని చక్రాయ పేట మండలం కేరాచపల్లి గ్రామంలో విష జ్వరాల బారిన పడ్డ బాధితులను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. శనివారం విష జ్వరాల బాధితులను పరామర్శించిన జగన్.. జ్వరాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
మంచినీటి వసతులు లేకపోవడం వల్ల విషజ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా కేరాచపల్లిలో నీటిని వైఎస్ జగన్ పరిశీలించారు.