శ్రీకాకుళంలో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌

శ్రీకాకుళంలో పర్యటించనున్న వైఎస్‌ జగన్‌ - Sakshi


హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19, 20 తేదీలలో రెండు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నెల 19న జిల్లాలోని హీరమండలం పాతపట్నం నియోజకవర్గంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులను వైఎస్‌ జగన్‌ కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు హీరమండలంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రికి కవిటిలో విశ్రాంతి తీసుకుంటారు.



19న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. అదే విధంగా 20న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జగతి గ్రామం హనుమాన్‌​ జంక్షన్‌లో కిడ్నీ బాధితులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుంటారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top