7, 8 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో జగన్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలను కలుసుకుంటారు. 6వ తేదీ రాత్రి హైదరాబాద్లో బయలుదేరి 7వ తేదీ ఉదయానికి వైఎస్సార్ జిల్లాకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాలో పర్యటన అనంతరం 9న అనంతపురంలో జరిగే ఒక వివాహానికి హాజరవుతారు. కాగా, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అన్న కుమారుడు లోక్నాథరెడ్డిని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు.