చంద్రబాబును ప్రజలు రాళ్లతో కొడతారు
నిజాలు చెబితే ఆయనకు అదే గతి: వైఎస్ జగన్
హామీలు అమలు చేయకుండా సాకులు.. రుణమాఫీపైనా బుకాయింపు
బాబు వస్తే జాబు వస్తుందన్నారు... ఇప్పుడు ఉన్నవి ఊడబెరుకుతున్నారు
అవ్వాతాతల పెన్షన్లకు అడ్డంగా కోతవేశారు
ఈ మోసాలకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 వంతపాడాయి
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యమిద్దాం
ఐదున జరిగే ధర్నాలను జయప్రదం చేయండి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికల ముందు అల వికాని హామీలు ఇచ్చి... వాటిని అమలు చేయకుండా రోజుకో అబద్ధం చెబుతున్న చంద్రబాబు ను ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. పదవి కోసం అబ ద్ధపు హామీలు గుప్పించిన చంద్రబాబు వాటిని అమలు చేయడానికి సాకులు చెబుతున్నాడని విమర్శించారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని ఒంగోలు, గిద్దలూరు, యర్రగొండపాలెం, కని గిరి, మార్కాపురం, దర్శి, కొండెపి నియోజకవర్గాలను ఆయన మంగళవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు సీఎం కావాలన్న కోరిక ఉండటానికి కారణాలు తెలియదు కానీ... తనకు ముఖ్యమంత్రి కావడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయ న్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే 30 ఏళ్లు పరిపాలించాలని, ఇన్నేళ్ల పాలనలో ప్రజ లకు ఎంతగా మంచి చేయాలంటే... తాను చని పోయాక వైఎస్ఆర్ ఫోటోతోపాటు తన ఫోటో కూడా ఉండాలన్న కోరిక బలంగా ఉందని చెప్పా రు. అందుకే అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయానన్నారు. ముఖ్యమంత్రి కావడం కోసం ఏ అబ ద్ధమైనా ఆడి, ఏ మోసమైనా చేసి, ఏ గడ్డైనా తిని ఆ సీట్లో కూర్చుంటే ప్రజలకు న్యాయం చేసిన వారం అవుతామా? అన్నది గుండెలపై చెయ్యి వేసుకుని ఆలోచించాలని బాబుకు సూచించారు. టీడీపీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఐదున కలెక్టరేట్ల ఎదుట జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. అదేరోజు తాను విశాఖపట్నంలో ధర్నాలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఇంకా ఆయనేమన్నారంటే...
ఇవాళ చంద్రబాబు రోజుకో అబద్ధం ఆడకపోతే ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉంది. బాబు నిజాలు చెబితే ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. అందుకే అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నారు. రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి, బంగారం బయటకు రావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలంటూ టీవీలలో, పత్రికల్లో, హోర్డింగ్లలో ఊదరగొట్టా రు. అధికారం వచ్చాక అన్నీ మర్చిపోయారు.
రుణమాఫీ విషయానికి వస్తే ఐదు వేల కోట్లు బడ్జెట్లో పెట్టారు. దీంతో 20 శాతం ప్రజల రుణం మొదటి దశలో మాఫీ చేస్తానని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాలు కలిపి రూ.1.01 లక్షల కోట్లున్నాయి. చంద్రబాబుమాట విని రైతులు వడ్డీలు చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ 14 శాతం పడింది. అంటే ఇప్పటికే రూ. 14 వేల కోట్ల భారం పడింది. ఈ ఏడాది ఐదువేల కోట్లే బడ్జెట్ కేటాయింపు ఉండటంతో వచ్చే ఏడాదికి ఈ వడ్డీ 28 వేల కోట్లకు చేరుతుంది. ఆయన కేటాయింపులు వడ్డీకి కూడా సరిపోని పరిస్థితి. అయినా ఇప్పటికీ అదేబుకాయిస్తూ ఉంటే ఈ మనిషి మనిషేనా అనిపిస్తుంది.
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఇప్పుడు బాబు వచ్చాడు ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారు. రాష్ట్రంలో కోటీ 75 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీరికి కనీసం నిరుద్యోగభృతి అయినా వస్తుందని ఎదురుచూస్తున్నారు. భృతి ఎప్పుడు ఇస్తారని నిలదీస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదని నిస్సిగ్గుగా దాటవేస్తున్నారు.
అవ్వా, తాతల పెన్షన్లు నిరంకుశంగా కట్ చేసి వారిని కూడా మోసం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల 11 వేల పింఛన్లున్నాయి. వాటిని వెయ్యి రూపాయలు చేస్తే నెలకి రూ.431 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.3,700 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే బడ్జెట్లో రూ.1,338 కోట్లు మాత్రమే పెట్టారు. అంటే అవ్వా తాతల పెన్షన్లో రూ.2,400 కోట్ల కోత పెట్టారు.
ఇంత మోసం చంద్రబాబు ఒక్కడే చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 కలిసి ఈ మోసపు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. ఐదేళ్ల తర్వాత కూడా వీరు చంద్రబాబుకు కొమ్ముకాస్తారు. చంద్రబాబు మంచివాడే. ఆర్బీఐ ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదంటూ ప్రచారం చేస్తారు.
ఆరు నెలలు కాకుండానే చంద్రబాబు పాలన ఎప్పుడెప్పుడు పోతుందా అని గ్రామాల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షంగా మనం ప్రజల తరపున పోరాడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటాలు చేయాలి, ప్రజలకు ఎలా అండగా నిలవాలనే అంశంపై దృష్టి పెట్టండి.
ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్సీపీ రాష్ట్ర నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీ ఎస్ నాగిరెడ్డి, తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్రెడ్డి, ఎమ్మెల్యేలు పోతు ల రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, జంకె వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కనిగిరి, కొండేపి నియోజకవర్గాల ఇంఛార్జులు బుర్రా మధుసూధన్ యాదవ్, వరికూటి అశోక్, పార్టీ నేతలు కేవీ రమణారెడ్డి, కుప్పం ప్రసాద్, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.