జగన్ 9వ రోజు రోడ్షో సాగేదిలా..
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తొమ్మిదో రోజు రోడ్షోను పెద్దాసుపత్రి వద్ద నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఏకలవ్యనగర్, సుంకులమ్మ గుడి, మారుతీనగర్, మంచినీళ్ల బావి దగ్గర హరిజనపేట, చెన్నకేశవస్వామి గుడిసెంటర్, జిలేబీ సెంటర్ కొలిమిపేట, షాదిక్నగర్, 21, 22 వార్డుల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.