పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం పులివెందుల చేరుకున్నారు. గత రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో బయలుదేరిన ఆయన బుధవారం ఉదయం ముద్దనూరు చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో వైఎస్ జగన్కు ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పులివెందుల బయలుదేరి వెళ్లారు. ఈ రోజు, రేపు ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.