రైతు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ జగన్
తణుకు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తణుకు చేరుకున్నారు. పట్టణంలోని రైతు దీక్షా స్థలికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్ నుంచి విమానంలో మధురపూడి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తణుకు వచ్చారు. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు.