వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా

వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా - Sakshi


హైదరాబాద్ : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త గుడిపాటి వెంకట్రామయ్య కుటుంబ సభ్యుల్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో  కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న  వెంకట్రామయ్యను ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి గొడ్డళ్లతో దాడిచేసి   హత్య చేసిన విషయం తెలిసిందే.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top