భూకంపంపై వైఎస్ జగన్ ఆందోళన
నేపాల్లోని మన వారి భద్రతకు చర్య తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు వినతి
సాక్షి, హైదరాబాద్: నేపాల్, భారతదేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో సంభవించిన భూకంపం, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వచ్చిన భూ ప్రకంపనల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్లో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు భారత ప్రభుత్వం ఇటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నేపాల్లోని మన పౌరుల భద్రతకు వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు.