గుంటూరు, ప్రకాశంలో వర్షాలపై జగన్ ఆరా
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ఉధృతిపై ఆరా తీశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఆయన గురువారం ఫోన్లో మాట్లాడారు. స్థానికంగా వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వరదల్లో బాధితలును ఆదుకోవాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వాలని ఈ సందర్భంగా వారికిసూచించారు. కాగా గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు