విజయనగరంలో వైఎస్ జగన్ పర్యటన


విజయనగరం : హదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం ఆయన విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం భోగాపురం మండలం ఏ రావివలస నుంచి తన పర్యటనను ప్రారంభించారు.


 


తుఫాను బాధితులు, రైతులను పరామర్శించిన ఆయన అనంతరం  దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్ పూసపాటిరేగ మండలంలోని కోనాడ, తిప్పలవలసలో పర్యటించి మత్స్యకారులు, రూతులను ఓదార్చి వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top