కొనుగోళ్లు.. ప్రలోభాలు బలాదూర్: వైఎస్ జగన్
హైదరాబాద్: ఏపీలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ కొందరు నేతలకు డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టిందని.. భయపెట్టిందని, అయినా ప్రజలు మాత్రం నిజం వైపు మొగ్గుచూపారని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మద్ధతుగా నిలిచిన ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల్లో విజయం సాధించిన నేతలకు వైఎస్ జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ఐదు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా నాలుగు చోట్ల టీడీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణం, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి నెగ్గగా.. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకర్గంలో వైఎస్సార్సీపీ మద్దతిచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి విజయం సాధించారు.
Some leaders can be bought or threatened but people always stay true. I thank you from the bottom of my heart.Congratulations to the winners
— YS Jagan Mohan Reddy (@ysjagan) 22 March 2017