నేడు గవర్నర్ను కలవనున్న జగన్
టీడీపీ హత్యా రాజకీయాలపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని రాజ్భవన్లో ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కలుసుకుంటారు. ప్రత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని దారుణంగా హతమార్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాల్పడుతున్న హత్యా రాజకీయాలపై జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేస్తారు. జగన్ వెంట పలువురు పార్టీ నేతలు కూడా గవర్నర్ను కలవడానికి వెళతారు.